చంద్రబాబును జైలులో పెట్టడాన్ని మర్చిపోను.. వేటాడుతా : నారా లోకేశ్

-

చంద్రబాబును జైలులో పెట్టడాన్ని మర్చిపోను.. వేటాడుతానని హెచ్చరించారు నారా లోకేశ్. టీటీడీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాసుకున్నానని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చెప్పారు.

Nara Lokesh Write a Letter to CM Jagan
Nara Lokesh Write a Letter to CM Jagan

ప్రభుత్వం మారిన వెంటనే వారికి బదులు తీరుస్తానని హెచ్చరించారు. యలమంచిలిలో మాట్లాడుతూ…. “చంద్రబాబును అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టడాన్ని నేను మర్చిపోను. సైకోను సింహం ఎలా వేటాడుతుందో చూస్తారు” అని పేర్కొన్నారు.

మూడు ముక్కలాటతో ప్రజా రాజధాని అమరావతిని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న సైకో జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు అని మరో పోస్ట్‌ పెట్టారు లోకేష్‌. వేల కోట్ల విలువైన భవనాలు శిథిలం చేశాడు. భూములు ఇచ్చిన రైతుల్ని హింస పెట్టాడు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించాడని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news