పల్నాడు విధ్వంసం: వైసీపీ ఎమ్మెల్యేల హౌస్ అరెస్ట్

-

పల్నాడు జిల్లాలో హింసాత్మక పరిస్థితులను చక్కదిద్దడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. 2వేల మంది పోలీసులు వివిధ ప్రాంతాల్లో మోహరించారు. మాచర్ల, గురజాల ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా అంతట 144 సెక్షన్ కొనసాగుతోంది.

Macharla and Gurjala MLAs Pinnelli Ramakrishna Reddy and Kasu Mahesh Reddy under house arrest

రోడ్లపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పల్నాడు ఎస్పీ మాచర్లలోనే ఉండి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. అటు పల్నాడు, అనంతపురం జిల్లాలు రణరంగంలా మారాయి. దీంతో ఈ రెండు జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్లు విధించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలను పోలీసులు లాఠీఛార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news