గెలుపు రాజేంద్రుడిదే….మల్కాజిగిరి కింగ్ ఈటెలే

-

మినీ ఇండియా మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలవబోతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ మేధావులు.తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా అందరి దృష్టి మాత్రం మినీ ఇండియాగా పిలుచుకునే మల్కాజ్గిరి పైనే ఉంది. ఇక్కడ ఎవరు విజయం సాధించబోతున్నారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. బిజెపి నుండి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు.గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండగా మెజారిటీ సర్వేలు మాత్రం రాజేందర్ వైపే ఉన్నాయి.అయితే అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు మే 13వ తేదీన తేల్చేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి.ఎవరు గెలుస్తారు అనేది ఆరోజు తేలిపోతుంది.

మల్కాజిగిరి సీటు సీఎం రేవంత్ కి సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. కానీ ఇక్కడ బిజెపి నుంచి బలమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న ఈటెల రాజేందర్ బరిలోకి దిగడంతో వారు వన్ సైడ్ అన్నట్లుగానే మారిపోయింది.మొదటినుంచి అన్ని వర్గాల నుంచి ఈటలకు మద్దతు లభిస్తోంది.అటు బిసి నేతలందరూ కూడా ఈటెల వైపు నిలిచారు. పార్టీ నుంచి కూడా పూర్తిస్థాయి మద్దతు ఉంది.అయితే మల్కాజ్గిరి బరిలో నిలిచిన ఈటెల ఇక కొన్ని హామీలను కూడా ఇచ్చారు.అవే ఇప్పుడు ఆయనకు ప్లస్ అయ్యాయని తెలుస్తోంది.వికసిత్ మల్కాజ్‌గిరి,స్వచ్ఛ మల్కాజ్‌గిరి,నైపుణ్య/స్కిల్డ్ మల్కాజ్‌గిరి,ఆరోగ్య/ఆయుష్మాన్ మల్కాజ్‌గిరి,ఆత్మనిర్భర నారీ శక్తి మల్కాజ్‌గిరి, డిజిటల్/ఐటి ఆధారిత మల్కాజ్‌గిరి,మేక్ ఇన్ మల్కాజ్‌గిరి అనే హామిలను ఈటల రాజేంద్ర అక్కడి ఓటర్లకు ఇచ్చారు. ఈ హామీలు ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి.

ఈటెల రాజేందర్ పనితనం ఎలా ఉంటుంది అనేది ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడే అందరూ చూసారు. కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి ఆయన తీసుకున్న చర్యలకు అప్పట్లో ప్రశంసలు దక్కాయి.ఇదే క్రమంలో ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతానని ఈటెల చెప్తున్నారు.అటు ఓటర్లలోను ఇదే నమ్మకం ఏర్పడినట్లు తెలుస్తోంది.ఎంపీగా మల్కాజ్గిరి అభివృద్ధికి రేవంత్ చేసింది ఏమీ లేదు. కేంద్రంలో మరోసారి బిజెపి రావడం పక్కా కాబట్టి ఈటలను గెలిపించుకుంటే తమ సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అక్కడి ఉద్యోగులు,సామాన్యులు ఈటల వైపే నిలిచారట. ఇలా అన్ని సమీకరణాలను కలుపుకొని మినీ ఇండియాగా పిలుచుకునే మల్కాజ్గిరిలో ఈటెల గెలుపు ఖాయమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news