ఇండియాలో భారీగా పెరిగిన కరోనా కేసులు… 24 గంటల్లో ఎన్ని అంటే?

-

కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. చాలామంది కరోనా వ్యాధి బారిన పడుతున్నారు. గత 24 గంటలలో 498 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 5,364 కి చేరుకుంది. నిన్న కర్ణాటకలో ఒకరికి, కేరళలో ఇద్దరికీ, పుదుచ్చేరిలో ఒకరు చొప్పున నలుగురు మంది కరోనా వ్యాధి బారిన పడి కన్నుమూశారు.

covid
Another corona case has been registered in the state of Andhra Pradesh

దీంతో ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కరోనా వ్యాధి బారినపడిన సంఖ్య 55కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 12, తెలంగాణలో 2 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62 కరోనా కేసులు, తెలంగాణ రాష్ట్రంలో 5 కరోనా కేసులు ఉన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అప్రమత్తమవుతున్నారు. కరోనా వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచి ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తింటూ ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news