ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా!

-

ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మంత్రి రోజా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమె పేరును రేపు లేదా ఎల్లుండి ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి జిల్లా నేతలకు సమాచారం ఇచ్చినట్లు టాక్. ఇంతకుముందు ఒంగోలు ఎంపీ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును పార్టీ ప్రతిపాదించింది. కానీ మాజీ మంత్రి బాలినేని సహా జిల్లాలోని నాయకులంతా చెవిరెడ్డిని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.

Ministar Roja is contesting as Ongole YCP MP candidate

ఇక అటు రాజమండ్రి YCP MP అభ్యర్థిగా సినీ నటుడు సుమన్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే YCP అగ్రనేతలు ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఇక్కడ MPగా పోటీచేసిన మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో MLAగా పోటీచేస్తున్నారు. గౌడ సామాజికవర్గానికి చెందిన సుమన్ MPగా పోటీ చేస్తే BC ఓట్లు గంపగుత్తగా పడే ఛాన్స్ ఉంటుందని YCP భావన. పైగా 25 ఏళ్లుగా ‘స్వర్ణాంధ్ర’ పేరిట సుమన్ ఇక్కడ సామాజిక సేవ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news