మరో వివాదంలో మంత్రి అంబటి..ఓ మహిళను డబ్బులు ఆడిగాడని !

-

మరో వివాదంలో మంత్రి అంబటి రాంబాబు చిక్కుకున్నారు. డబ్బులు ఆడిగాడని ఓ మహిళ తెరపైకి వచ్చింది. తమ కుమారుడు చనిపోతే జగన్‌ ప్రభుత్వం చేసిన రూ. 5లక్షల సాయంతో రూ. 2.50 లక్షలు ఇవ్వాలని సత్తెనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త అడిగినట్లు బాధితులు మీడియాతో మాట్లాడారు.

‘వచ్చిన డబ్బుతో కుమార్తె పెళ్లి చేయాలనుకున్నాం. దీనిపై మంత్రి అంబటి రాంబాబును కలిస్తే, ఇవ్వాల్సిందేనని ఆయన గధమాయించారు. చనిపోవాలనుకున్నాం. ఈ విషయంలో చెప్పిన మాట వినకపోతే పథకాలు రావని సిఐ కూడా బెదిరించారు’ అని వారు వీడియోలో మాట్లాడారు. అయితే, ఈ సంఘటపై అంబటి రాంబాబు కూడా క్లారిటీ ఇచ్చారు. దున్నపోతు ఈనిందని ఈనాడు అంటే దూడను కట్టేయండని బాబు అంటున్నాడు నారా చంద్రబాబూ…నీ బ్రతుకంతా ఇంతే ! అంటూ ఈనాడు రాసిన వార్తను ట్యాగ్‌ చేసి.. చురకలు అంటించారు మంత్రి అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version