విశాఖను రాజధానిని చేస్తే చంద్రబాబుకు వచ్చే నష్టం ఏంటి? – మంత్రి ధర్మాన

-

విశాఖను రాజధానిని చేస్తే టిడిపి అధినేత చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. చంద్రబాబు తెలంగాణలో బిజినెస్ లు చేస్తూ.. హైదరాబాదులో ఉంటాడని విమర్శించారు. రాష్ట్రానికి దూరంగా, జూమ్ కెమెరాకు దగ్గరగా ఉంటాడని సెటైర్లు సంధించారు. అలాంటప్పుడు చంద్రబాబుకు రాజధాని ఎక్కడ పెట్టుకుంటే మీకెందుకు అని నిలదీశారు.

అమరావతి పేరుతో పాదయాత్ర చేసిన రైతులు తోక ముడిచి వెనకకు పారిపోయారని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా పెట్టారా అని ప్రశ్నించారు. అసలు టిడిపి ఆవిర్భావం నుంచి ఒక మంచి పని అయినా చేశారా అని ఎద్దేవా చేశారు. టిడిపిని శ్రీకాకుళం జిల్లా నుంచి వెలివేయాలని జిల్లా ప్రజలకు ధర్మాన పిలుపునిచ్చారు. టిడిపి హయాంలో ఉద్దానం కిడ్నీ బాధితులకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news