ఏపీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. తిరుపతి వెంకటగిరి మండలం యతలూరులో రైతులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడా దళారులకు చోటు లేదని తెలిపారు. తీసుకున్న ధాన్యానికి 24 గంటల్లోనే నగదు చెల్లిస్తున్నామని వెల్లడించారు.
రైతుల నుంచి 36 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారి ఖాతాల్లో రూ.8300 కోట్లు జమ చేసినట్లు వెల్లడించిన ఆయన తిరుపతి జిల్లాల్లోనే 74వేల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ లోనూ మరో 56 వేల టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ-కేవైసీ నమోదు కాలేదని ధాన్యం కొనుగోళ్లు ఆపమని.. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.