తెలంగాణ గ్రూప్‌ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి

-

తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగింది. గ్రూప్-1 నియామకాలపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్​ను తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో 29 చెల్లుబాటును సవాల్​ చేస్తూ గ్రూప్​-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టి ఈ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. దీంతో నియామకాలకు అడ్డంకి తొలగినట్లయింది. ఇప్పటికే గ్రూప్​ -1 జనరల్​ ర్యాంకింగ్​ జాబితాను విడుదల చేసిన టీజీపీఎస్సీ ..త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన చేయనుంది.

ఇక దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం జీవో 29ని జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్​-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్​ను దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. మరోవైపు మార్చి 30వ తేదీన గ్రూప్​-1 జీఆర్​ఎల్​ జాబితాను తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ విడుదల చేసింది. గ్రూప్​-1 పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో తమ ర్యాంకులను చూసుకోవచ్చని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news