బాలకృష్ణ మొన్న తొడ కొట్టారు.. ఇవాళ తోక ముడుచుకొని పారిపోయారు : మంత్రి రోజా

-

ఇవాళ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్ కు మద్దతుగా తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్.కే. రోజా మాట్లాడారు. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేశారు. ప్రతీ ఆడబిడ్డ కష్టాలను సీఎం జగన్ తీర్చుతున్నారు. సీఎం జగన్ మహిళల కోసం చేసిన కృషిని చూసి మహిళలందరూ జయహో జగన్ అంటున్నారు. సంక్షేమం అంటే ఏంటో సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో చూపించారు.

14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో చెప్పగలరా..? ఆడపుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఓ చీటర్.. జగన్ లీడర్ అన్నారు. చంద్రబాబుకు పబ్లిసిటి పిచ్చి ఎక్కువ అన్నారు.  చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ కూడా నమ్మరు. మొన్న బాలకృష్ణ తొడగొట్టారు.. ఇవాళ తోక ముడిచారు. సీఎం జగన్  చేసిన సంక్షేమంపై బాలకృష్ణ చర్చకు రావాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదు.. పనికిమాలిన పార్టీ అని పేర్కొన్నారు రోజా. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే రాజకీయంగా సీఎం జగన్ అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version