త్వరలోనే 40వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ : మంత్రి కేటీఆర్

-

త్వరలోనే 40వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ హైదరాబాద్ నగరంలోని మూసారాంబాగ్ వద్ద రూ.152 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన బ్రిడ్జీ నిర్మాణానికి మంత్రి  శంకుస్థాపన చేశారు. దీంతో పాటు మూసీ, ఈసా నదిలపై రూ.545 కోట్లతో 14 వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2020లో వరదలు వచ్చినప్పుడూ ఇక్కడ చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. కరోనా కారణంగా కొన్ని పనులను చేయలేకపోయామని. ఇప్పుడు అన్నింటినీ పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేయాలనే ఎస్టీపీలను నిర్మిస్తున్నామన్నారు. దుర్గం చెరువుపై నిర్మించిన బ్రిడ్జి కంటే మరింత అందమైన బ్రిడ్జీలను నిర్మిస్తామన్నారు. గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతామని చెప్్పరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version