AP : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి

-

ఏపీలో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి చెందారు. ఉండి మండలం చెరుకువాడలో కారు యాక్సిడెంట్ లో సాబ్జీ మృతి చెందారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ షేక్ సాబ్జి ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి షేక్ సాబ్జి కారును ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.

MLC Sheikh Sabji died in a road accident

ఈ ఘటన స్థలంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మృతి చెందగా, పలుగురికి గాయాలయ్యాయి. షేక్ సాబ్జి గన్మెన్ కి కూడా గాయాలయ్యాయి.దీంతో భీమవరంలోని వర్మ ఆసుపత్రికి గాయలు అయిన వారిని తరలించారు. షేక్ సాబ్జి మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సంఘటన విషయం తెలియగానే.. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news