టీటీడీ గోశాలలో 100 కు పైగా గోవులు మృతి !

-

టీటీడీ గోశాలపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ గోశాలలో గత మూడు నెలల్లో 100 కు పైగా గోవులు మృతి చెందాయని బాంబు పేల్చారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. కానీ ఈ విషయాన్ని బయటికి రాకుండా దాచిపెట్టారని ఫైర్ అయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, తిరుమల పవిత్రతను కాపాడతామని చెప్పిన వాళ్లంతా ఏమయ్యారు? అంటూ నిలదీశారు.

ttd

మా హయాంలో దాదాపు 550 ఆవులను దాతల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చామన్నారు. ఆ ఆవులు ఇచ్చే 15 వేల లీటర్ల పాలతో నిత్యం వేంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాదం కోసం వాడామని చెప్పారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. కానీ ఇప్పుడు ఆ ఆవులకు పుట్టిన దూడలు, ఇతర గోవుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news