వైఎస్‌ షర్మిల రెడ్డి కాదు…మొరుసుపల్లి షర్మిల శాస్త్రి !

-

 

వై.యస్. షర్మిల రెడ్డి అని నిన్న మొన్నటి వరకు సాక్షి దినపత్రికలో రాసుకుని, ఇప్పుడు ఆమె ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవీ బాధ్యతలను చేపట్టగానే మొరుసుపల్లి షర్మిల శాస్త్రి అని రాస్తారా?, ఇదేమి పైత్యమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు. మొదట షర్మిల రెడ్డి అని రాసిన మీరే ఇప్పుడు ఆమె రెడ్డి కాదని అంటే మీ ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

వై.యస్. రాజారెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు కూడా రెడ్డి కాదా?, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిది వేరే కులమా??, వాళ్లు ముగ్గురూ రెడ్డి అయినప్పుడు షర్మిల గారు రెడ్డి కాకుండా ఎందుకు పోతారని నిలదీశారు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె గురించి నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషిస్తుంటే రక్తం మరిగిపోతుందని అన్నారు.

వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి కూతురు గురించి వాళ్ల అబ్బాయే మాట్లాడిస్తుండడం విస్మయాన్ని కలిగిస్తోందని, కుటుంబం జోలికి వస్తే ఊరుకోమని చెప్పి, ఇప్పుడు సోదరి గురించి తన అనుచరులు, ఎన్నారై వింగ్ ప్రతినిధులు సభ్య సమాజం తలదించుకునే విధంగా దూషిస్తుంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఖండించరా? అంటూ రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version