ఎంపీ అవినాష్ రెడ్డి రాజకీయ లబ్ది పరామర్శలు మానుకోవాలి : బీటెక్ రవి

-

ఎంపీ అవినాష్ రెడ్డి రాజకీయ లబ్ది పరామర్శలు మానుకోవాలని పులివెందుల టీడీపీ ఇంచార్జ్  బీటెక్ రవి పేర్కొన్నారు. వైస్ అవినాష్ రెడ్డి తన రాజకీయ లబ్ది కోసమే నిన్న సింహాద్రిపురంకి పరామర్శకు  వచ్చారు. ముఖ్యంగా అవినాష్ రెడ్డితో పాటు సింహాద్రిపురం వైసీపీ నాయకులు హజీవలి తదితర మైనార్టీ నాయకులు వచ్చారు. ప్రశాంతంగా ఉన్న సింహాద్రిపురంను లేని పోని వివాదాలు సృష్టించి వైస్ అవినాష్ రాజకీయ లబ్ది పొందాలని అనుకుంటున్నాడు.

హత్య రాజకీయల గురించి మాట్లాడే అర్హత ఎంపీ అవినాష్ రెడ్డి గారికి లేదు వినుకొండలో రషీద్ హత్య పార్టీలకు సంబంధం లేదు అది వ్యక్తిగత కక్షలు తప్ప అందులో రాజకీయ ప్రేమేయము లేదు. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రోద్భలంతో టీడీపీ నాయకులను హత్య చేసిన వారి కేసులు త్వరలోనే విచారణకు వస్తున్నాయి ఆ కేసులలో ఉన్న నిందితులు తప్పించుకోలేరు అని పేర్కొన్నారు పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి.

Read more RELATED
Recommended to you

Latest news