వైసీపీకి ఎంపీ మాగుంట రాజీనామా..టీడీపీలోకి జంప్ ?

-

ఇవాళ మాగుంట వైసీపీకి రాజీనామా చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒంగోలులోని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంలో 9 గంటలకు మీడియా సమావేశం ఉంది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణను వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఒంగోలు ఎంపీగా సిట్టింగ్ సీటును కొనసాగించమని స్పష్టం చేసింది వైసీపీ అధిష్టానం. ఈ సారి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీలో నిలపాలని భావించారు మాగుంట.

అటు ఒంగోలు ఎంపీ అభ్యర్ధిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరును ప్రచారంలోకి తీసుకువచ్చింది వైసీపీ. మాగుంట కోసం చాలా రోజుల పాటు మాజీమంత్రి బాలినేని..పట్టుబట్టారు. కానీ వైసీపీ కాదనటంతో టీడీపీ టచ్ లోకి వెళ్లారు మాగుంట. ఇక వేచి చూడటం అనవసరమని మాగుంటపై సన్నిహితుల ఒత్తిడి కూడా పెరిగింది. పలు దఫాలు తన ఆంతరంగికులతో మాగుంట మంతనాలు జరిపారట. ఇక ఇవాళ మాగుంట వైసీపీకి రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉంది. తన రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయాన్ని స్పష్టం చేయనున్నారు మాగుంట.

Read more RELATED
Recommended to you

Latest news