ఏపీ మంత్రి రోజాపై వైసీపీ ఎంపీ సెటైర్లు..!

-

గతంలో మంత్రి రోజా రెడ్డి గారు చెప్పింది నిజమేనని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. రెడ్డి అనేది ఒక కులం కాదు.. గుణం అన్నారు. రెడ్డి అనేది కులం కాదు అని తాను కూడా గతంలో ఎన్నోసార్లు రచ్చబండ కార్యక్రమంలో వెల్లడించానని, రెడ్డి అనే టైటిల్ అనేక కులాలకు చెందిన వారికి ఉంటుందని, కానీ రెడ్లలో చాలా మందికి గుణం అనేది ఉండదన్నారు. ఈ మధ్య దారుణంగా పడిపోయిందని అన్నారు.

సుప్రీం కోర్టులో జగన్ మోహన్ రెడ్డి గారిపై తాను దాఖలు చేసిన పిటిషన్ పై నోటీసులు జారీ చేసిన తర్వాత, అమెరికా నుంచి రెండు కుక్కలు మొరగడం ప్రారంభించాయని, ఫోన్లు చేసి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వారు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిదని రఘురామకృష్ణ రాజు గారు హెచ్చరించారు.స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాఖలు చేసిన పిటిషన్ నిన్న విచారణకు వచ్చిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఐడీ విచారణ జరుగుతున్న దానికి వ్యతిరేకంగా… సీబీఐ చేత విచారణ జరిపించాలి అంటే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news