ముంబై సినీ నటి కేసులో కీలక పరిణామం..!

-

ఏపీలో గత నెల రోజులుగా ముంబై సినీ నటి కాదంబరి జిత్వానీ కేసు చర్చలో ఉన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో తాజాగా ఈ ముంబై సినీ నటి కేసులో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. జిత్వానీ నుంచి పాలం కొనలేదనీ, వైసీపీ నేత విద్యాసాగర్ కట్టుకథ అల్లారనీ కోర్టుకు తెలిపారు సాక్షులు. ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చిన సాక్షులు నాగేశ్వరరాజు, భరత్ కుమార్. జిత్వానీ నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేటలో ఎకరాల భూమిని కొనుగోలు చేశామనటం అబద్దం అని స్టేట్ మెంట్ ఇచ్చారు.

జిత్వానీ తమకు రూ. 5 లక్షలు చెల్లించలేదు. తమకు సంబంధం లేకపోయినా కేసులోకి తమ పేరును లాగి పరువుకి నష్టం కలిగించారని దీనిపై కూచిపూడి పోలీసులకు ఫిర్యాదు చేశామని స్టేట్ మెంట్ ఇచ్చారు సాక్షులు. ఇక ఈ స్టేట్ మెంట్ తో ఈ కేసు మరో మలుపు తిరిగింది అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news