పోలీసులు కుట్ర పూరితంగా వ్యవహరించారు : జస్వాని న్యాయవాది

-

పోలీసులు జస్వానీ నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నట్లు ముంబై సినీ నటి జస్వాని న్యాయవాది నర్రా శ్రీనివాస్ పేర్కొన్నారు. స్టేట్ మెంట్ లో ముగ్గురు ఐపీఎస్ అధికారులు పిఎస్సా ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్, గున్నీతో పాటు మరో ఇద్దరు ఇబ్బందులకు గురి చేశారని స్టేట్ మెంట్ ఇచ్చారు. అలాగే నటిపై ఎక్కడా ఎటువంటి కేసులు లేవు అని.. 41ఏ నోటీసులు ఇవ్వాల్సిన ఈ కేసులో కుట్ర పూరితంగా పోలీసులు వ్యవహరించారు అని పేర్కొన్నారు న్యాయవాది.

ఇక సీనియర్ సిటీ జన్ లుగా ఉన్న నటి తల్లి దండ్రులను జైల్లో పేట్టి బెయిల్ రాకుండా చేశారు అని పేర్కొన ఆయన.. దీని వెనుక ఎవరైనా ఉన్నారేమో పోలీసు విచారణలో తేలుతుంది అన్నారు. అలాగే నటిపై ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్ చూపుతున్న అగ్రిమెంట్ కూడా కేసు పెట్టడం కోసం తయారు చేసిందే అని తెలిపారు. ఇక ప్రస్తుతం నటి జస్వనాతో పాటుగా ఆమె తల్లి నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తున్నారు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news