నేడు శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా బహిరంగ సభ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బిజెపి ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీలో బిజెపిని స్థానికంగా బలంగా చేసేందుకు అధిష్టానం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే వరుసగా జాతీయ నేతలను ఏపీకి పంపిస్తోంది అధిష్టానం.

ఇక ఇందులో భాగంగానే ఇవాళ ఏపీలో బిజెపి బహిరంగ సభ నిర్వహించనుంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవ్వాల శ్రీకాళహస్తిలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోమ వీర్రాజు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అలాగే ఏపీకి అందించిన సహాయాన్ని ఈ సందర్భంగా జేపీ నడ్డా ఏపీ ప్రజలకు వివరించనున్నారు. ఇక రేపు విశాఖలో అమిత్ షా బహిరంగ సభ జరగనుండగా ఆ తర్వాత రాజమహేంద్రవరంలో మురళీధరన్ గారి సమావేశం కూడా ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version