చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారు: భువనేశ్వరి

-

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం పట్ల ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మానసిక, శారీరక అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని తెలిపారు. ఆయనకు అత్యవసర వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. బాబు 5 కిలోల బరువు తగ్గారని.. ఇంకా తగ్గితే ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘జైలులో నా భర్తకు సకాలంలో వైద్యం అందించట్లేదు. ఇప్పటికే ఆయన 5 కిలోల బరువు తగ్గారు. ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. జైలులో ఓవర్‌హెడ్‌ నీళ్ల ట్యాంకులు అపరిశుభ్రంగా ఉన్నాయి. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. జైలులో పరిస్థితులు నా భర్తకు తీవ్ర ముప్పు తలపెట్టేలా ఉన్నాయి. చంద్రబాబుకు అత్యవసరం వైద్యం అవసరం’’ అని నారా భువనేశ్వరి ట్వీట్​లో రాసుకొచ్చారు.

మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కోడలు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో అపరిశుభ్ర వాతావరణం, అపరిశుభ్రమైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు ఉన్నాయని… ఆ నీళ్ల వినియోగంతో చంద్రబాబు ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆవేదన చెందారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులంతా తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు .. ఆయనకు అత్యవసరంగా వైద్యం అందించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version