వసతి దీవెన, విద్యా దీవెన రద్దు చేస్తాం : నారా లోకేశ్ సంచలనం

-

టీడీపీ నేత నారా లోకేష్ సంచలన ప్రకటన చేశాడు. వసతి దీవెన, విద్యా దీవెన పెద్ద స్కామ్ లు అని, వాటిని రద్దు చేస్తామని నారా లోకేష్ అన్నారు. కాలేజీ ఖాతాల్లో వేయాల్సిన డబ్బును జగన్ సర్కారు గొప్పగా చెప్పుకునేందుకు విద్యార్థుల ఖాతాల్లో వేస్తామని చెప్పి, వెయ్యట్లేదని విమర్శించారు.

దీంతో ఫీజు కట్టకపోవడంతో రెండు లక్షల మంది సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉండిపోయాయని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక నేరుగా కాలేజీ ఖాతాలోనే డబ్బులు వేస్తామన్నారు. సీఎం జగన్‌కు రూ. లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశారు నారా లోకేశ్. CM జగన్ కు బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయలో ప్యాలస్ లు ఉన్నాయని… వైజాగ్ లో మరొకటి కడుతున్నారని టిడిపి నేత లోకేష్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news