సీఎం జగన్‌కు రూ.లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయి : లోకేశ్

-

సీఎం జగన్‌కు రూ. లక్ష కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేశారు నారా లోకేశ్. CM జగన్ కు బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయలో ప్యాలస్ లు ఉన్నాయని… వైజాగ్ లో మరొకటి కడుతున్నారని టిడిపి నేత లోకేష్ ఆరోపించారు.

ప్రకాశం జిల్లా K.అగ్రహారం బహిరంగసభలో మాట్లాడుతూ…’జగన్ కులం క్యాష్, మతం క్యాష్. రూ. లక్ష కోట్ల ఆస్తి ఉంది. రూ. లక్ష విలువైన చెప్పులతో తిరుగుతున్న పేదవాడినని చెప్పుకుంటారు’ అని మండిపడ్డారు. పిన్ని తాళి తెంచింది ఎవరు? చెల్లిని చిత్రహింసలు పెట్టింది ఎవరని ప్రశ్నించారు. అటు కొండపి నియోజకవర్గాన్ని టిడిపి సర్కారు అభివృద్ధి చేస్తే, నేడు సైకో జగన్ ప్రభుత్వం దోచేస్తోందని ఫైర్‌ అయ్యారు. అరాచక వైకాపా సర్కారుపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే సింహం స్వామి గారిని మరోసారి గెలిపించాలని కోరారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news