నోట్ల‌పై నేతాజీ బోమ్మ వేయాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త డిమాండ్

-

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. తెర మీద‌కు కొత్త డిమాండ్ తీసుకువ‌చ్చారు. రూ. 100 నోట్ల‌పై నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బొమ్మ వేయాల‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిప్రాయప‌డ్డారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను గౌర‌వించుకోక‌పోతే.. మ‌నం భార‌తీయులమే కాద‌ని అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన గొప్ప వీరుడ‌ని కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అస్థిక‌లు రెంకోజీ ఆల‌యంలో దిక్కులేని ప‌రిస్థితుల్లో ఉన్నాయ‌ని అన్నారు.

pawan-kalyan

ఆయ‌న అస్థిక‌లను భార‌త్ కు తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కోసం కొత్త త‌రం ముందుకు క‌ద‌లాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిలుపు నిచ్చారు. కాగ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరుల పుస్త‌కాలు చ‌ద‌వ‌డం వ‌ల్లే.. త‌న‌కు జీవితం అంటే ఏంటో తెలిసింద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. అయితే నోట్ల‌పై నేతాజీ చంద్ర బోస్ బోమ్మ వేయాల‌ని గ‌తంలో కూడా ప‌లువురు డిమాండ్ చేశారు. తాజా గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఇదే డిమాండ్ చేయ‌డంతో ఈ అంశం మ‌రో సారి తెర‌పైకి వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news