అవినీతికి పాల్పడిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు – మంత్రి బొత్స

-

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు. అధికారులు చట్టబద్ధంగానే ముందుకు వెళ్లారని.. అక్రమంగా అరెస్టు చేస్తే కోర్టులు ఒప్పుకుంటాయా..? అని ప్రశ్నించారు. కేసులో లోకేష్ పాత్ర కూడా ఉంటే ఆయన కూడా విచారణ ఎదుర్కొంటారని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లు దోపిడీ చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని అన్నారు మంత్రి బొత్స. అన్ని న్యాయపరమైన అంశాలు పరిశీలించిన తరువాతే చంద్రబాబుని అరెస్టు చేశారని తెలిపారు. ఇక మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంతా చంద్రబాబు కుట్రేనని అన్నారు. ఈ స్కీం జీవో ఒకలా.. ఎంఓయు మరోలా ఉందన్నారు. ఇష్టానుసారం షెల్ కంపెనీలకు నిధులు మళ్ళించారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news