రఘురామ రాజుకు నో టికెట్…ఆశ చూపి మోసం చేసిన బీజేపీ ?

-

ఇండియా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకెళ్తోంది 400 సీట్లు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. తాజాగా 111 మందితో 5వ జాబితా విడుదల చేశారు.

raghurama-krishnam-raju- on vyugam movie

తాజాగా బీజేపీ విడుదల చేసిన లిస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి చెందిన అభ్యర్థులు కూడా ఉన్నారు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్ తో పాటు ఏపీలో 6గురు అభ్యర్థులు ఉన్నారు. రాజమండ్రి -పురంధేశ్వరి, అనకాపల్లి-సీఎం రమేష్, అరకు-కొత్తపల్లి గీత, రాజంపేట-కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి-వరప్రసాద్, నరసాపురం- శ్రీనివాస్ శర్మ.. ఖమ్మం పార్లమెంట్ నుంచి తాండ్ర వినోద్ రావు, వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేయనున్నారు. ఇదిలా ఉంటే..నరసాపురం ఎంపీ టికెట్‌ రఘురామరాజుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ..చివరికీ ఆయనకు ఇవ్వకుండా..శ్రీనివాస్ శర్మకు ఇచ్చారు. దీంతో రఘురామకు నిరాశ ఎదురైంది.

 

Read more RELATED
Recommended to you

Latest news