BREAKING : గొల్లపూడిలో టీడీపీ నిరాహార దీక్షకు నోటీసులు

-

చంద్రబాబు అరెస్ట్ అక్రమంగా టిడిపి నేతలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. గాంధీ జయంతి సందర్భంగా సత్యమేవ జయతే పేరిట ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగించనుండగా… రాజమండ్రి జైలులో చంద్రబాబు, రాజమండ్రి క్వారీ మార్కెట్ సమీపంలో భువనేశ్వరి, ఢిల్లీలో నారా లోకేష్, మంగళగిరి పార్టీ ఆఫీస్ లో అచ్చెన్నాయుడు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టిడిపి నేతలు దీక్ష చేపట్టారు.

Notices for TDP hunger strike in Gollapudi

ఇక ఈ తరుణంలోనే.. టీడీపీ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడిలో టీడీపీ నిరాహార దీక్షకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. దేవినేని ఉమా ఇంటి దగ్గరకు చేరుకున్న పోలీసులు..నోటీసులు ఇష్యూ చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నోటీసులు జారీ చేసిన పోలీసులు.. దేవినేని ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అంతేకాదు.. గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర భారీగా మోహరించిన పోలీసులు.. దీక్షలు చేస్తే అరెస్ట్‌ చేస్తే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version