జగన్ కు బిగ్‌ షాక్‌.. అక్టోబర్ 2 నుంచి పంచాయతీ ఉద్యోగుల సమ్మె !

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఊహించని షాక్‌ తగిలింది. ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. గ్రామ స్వరాజ్యానికి ప్రతీక మహాత్మా గాంధీజీ జయంతి రోజు అయినా అక్టోబర్ 2వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు 9 ప్రధాన డిమాండ్లతో పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కు ఉద్యోగుల సంఘం సమ్మె నోటీసు పంపించింది.

ప్రభుత్వం వెంటనే తమకు చెల్లించాల్సిన బకాయి, జీతాలు చెల్లించి కార్మికుల కుటుంబాలను కాపాడాలని పంచాయతిరాజ్ శాఖ కమిషనర్ ను ఉద్యోగుల సంఘం కోరింది. పంచాయతీ కార్మికులు గ్రీన్ అంబాసిడర్లకు రూ.20వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేసింది. నెలకు రూ. 6 వేల చొప్పున ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, రక్షణ పరికరాలు, ఏకరూప దుస్తులు సకాలంలో అందించాలని కోరింది.

అలాగే సమాజంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, సాధారణ మృతికి రూ. 5లక్షలు అందించాలని పంచాయతిరాజ్ శాఖ కమిషనర్ ను ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం వెంటనే ఆపేయాలని కోరారు. అలాగే పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version