బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వం పై పవన్ సీరియస్..రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ?

-

విజయవాడలో కోవిడ్ సెంటర్ గా ఉన్న స్వర్ణ ప్యాలస్ లో అగ్ని ప్రమాద ఘటన మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోవిడ్ కేంద్రంలో ప్రమాదం హృదయవిదారకమని పేర్కొన్న ఆయన అగ్ని ప్రమాదం చోటు చేసుకొని 11 మంది మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. కరోనా వైరస్ తో బాధపడుతూ చికిత్స కోసం ఇక్కడకు చేరినవారు ఈ విధంగా ప్రమాదం బారినపడటం అత్యంత విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్న రమేశ్ హాస్పిటల్స్ కు అనుబంధంగా హోటల్లో నడుస్తున్న ఈ కోవిడ్ కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ? అని ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొంటే అత్యవసర మార్గాల ద్వారా బయటపడే వ్యవస్థలు ఎలా ఉన్నాయి ? ఈ ఘటనకు కారణాలు ఏమిటి? అలానే ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయనే దాని మీద సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో వివిధ హోటల్స్, భవనాల్లో నడుస్తున్న కోవిడ్ కేంద్రాల్లో ఉన్న రక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించాలని పవన్ కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news