బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాకులాట!

-

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాకులాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పొత్తులో భాగంగా కేవలం 24 సీట్లు మాత్రమే జనసేనకు కేటాయింపులు చేశారు. జనసేనకు 24 సీట్లే చాలా ఎక్కువ అన్నట్టుగా టీడీపీ భజన వెబ్ సైట్లు, ఛానళ్ళు ప్రచారం చేస్తున్నాయి.

 

pawan chandrababu
pawan chandrababu

సోలోగా పోటీ చేసిన జనసేన అంతకుమించి సీట్లు ఈ సారి దక్కించుకునే అవకాశం ఉందంటున్నది జనసేన క్యాడర్. ఇక ప్రకటించిన 5 సీట్లలో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదు. అయితే..బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాకులాడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే జనసేన తక్కువ సీట్లు ఇచ్చారట.

దీనిపై సజ్జల కౌంటర్ ఇచ్చారు. 24 సీట్లతో యుద్ధం చేస్తావా..? పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి.పవన్ కళ్యాణ్ చూస్తే జాలేస్తోంది. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారు. చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారు. ఎన్నో ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారు. పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కి లేవన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news