భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ !

-

నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని రఘురామకృష్ణ రాజు కోరారు. రెండేళ్ల క్రితం నుంచి మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని తాను చెబుతూనే ఉన్నానని, పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారని చెప్పానని, భీమవరంలో ఆయన 50 వేలపై చిలుకు మెజారిటీతో విజయం సాధిస్తారని, కుల, మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

Jana Sena Pawan Kalyan

టీడీపీ, జనసేన పార్టీలలోని నాయకులు ఆ ఊర్లో, ఈ ఊర్లో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని సాక్షి దినపత్రికలో ప్రతినిత్యం కనిపించే వార్తలే ఈరోజు కూడా కనిపించాయని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. టీడీపీ, జనసేన నాయకులను రెచ్చగొట్టాలని కొన్ని చిల్లర చానల్స్ ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటికి జనసేన పక్షపాత చానల్స్ గా ముద్ర వేసి అందులో తింగరి మాటలను మాట్లాడించి, పొత్తుకు విఘాతం కలిగించాలనే ప్రయత్నాలను చేశారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news