నేను కనిపించడం లేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు – పవన్ కళ్యాణ్

-

భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో ఆంధ్రప్రదేశ్ చిగురుటాకులా వనికిపోయింది. ముఖ్యంగా విజయవాడ సగానికి పైగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. బుడమేరు వాగు వరద పోటెత్తడమే ఇందుకు కారణం. దీంతో నాలుగు రోజులుగా ప్రజలు వరద నీటిలోనే ఉంటున్నారు. అయితే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదని, వరద ముంపు ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటించకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా అక్కడికి వెళ్లే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇంత పెద్ద విలయం తాండవం చేస్తుంటే ఎందుకు బయటకు రావడం లేదంటూ విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం మీడియా సమావేశంలో తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను కనిపించడం లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళితే సహాయక చర్యలకు చాలా ఇబ్బంది కలుగుతుందనే వెళ్లలేదని స్పష్టం చేశారు.

వైసిపి నేతలు సహాయక చర్యలలో పాల్గొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రశంసించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదని.. అనేక సవాళ్ల మధ్య అధికారం చేపట్టామన్నారు. ఇక బుడమేరు 90% ఆక్రమణలకు గురైందని తెలిపారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version