గ్రామ పంచాయతీలకు పవన్ కళ్యాణ్‌ శుభవార్త..ఇక రూ. 25 వేలు !

-

Pawan Kalyan good news for Gram Panchayats: గ్రామ పంచాయతీలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ శుభవార్త అందించారు. గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని… వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంచామని ప్రకటన చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌. ఆగస్టు 15 కార్యక్రమాలకు రూ.100, రూ.250 ఇచ్చే మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలకు పెంచామని వెల్లడించారు. ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌.

Pawan Kalyan good news for Gram Panchayats

ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారని… ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేశామని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత చెప్పాలన్నారు. పారిశుధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news