వంగవీటి రంగ హత్యకు పవన్ కళ్యాణ్ కొత్త భాష్యం చెప్పారు – అంబటి రాంబాబు

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు. టిడిపి అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని ఆరోపించారు. వంగవీటి రంగ హత్యకు పవన్ కళ్యాణ్ కొత్త భాష్యం చెప్పారని ఎద్దేవా చేశారు. కాపులకు వైసీపీ హయాంలోనే మేలు జరిగిందని అన్నారు. కాపు ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ తిట్టడం సరికాదన్నారు అంబటి రాంబాబు.

గతంలో రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేయడమే కాకుండా.. ముద్రగడ ఉద్యమాన్ని చంద్రబాబు అనిచి వేయడాన్ని చూసామని విమర్శించారు. కాపు ఎమ్మెల్యేలను పవన్ కళ్యాణ్ దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయాలలో ఉన్న వ్యక్తి ఇంత దిగజారి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. రంగ హత్యకు కారణమైన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ జతకట్టారని.. కాపు సోదరులు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు మంత్రి అంబటి రాంబాబు. కాపులకు సీఎం జగన్ అన్ని రకాలుగా అండగా నిలిచారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version