వచ్చే ఏడాది జనసేన-టీడీపీ ప్రభుత్వంలో సంక్రాంతి జరుపుకుందాం – పవన్‌ కళ్యాణ్‌

-

వచ్చే ఏడాది జనసేన-టీడీపీ ప్రభుత్వంలో సంక్రాంతి జరుపుకుందామన్నారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఇవాళ భోగి మంటలు అంటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్..అనంతరం జీవో కాపీలను భోగి మంటల్లో తగులబెట్టారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు. రాజధాని రైతులకున్న కీడు, పీడ తొలగిపోయే రోజులు దగ్గర ఉన్నాయి…రాజధాని రైతులు పడ్డ కష్టం.. ఇబ్బందులను తీర్చడానికి టీడీపీ – జనసేన కలిశాయని తెలిపారు.

Pawan Kalyan of Janasena party to Visakha today
pawan kalyan in bhogi celebrations

రైతుల కష్టాన్ని మేం తీరుస్తామని…యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అంటూ అదే వర్గాలను మోసం చేసింది వైసీపీ అని పేర్కొన్నారు. ముళ్ల కంచెలు వేసినా దాటుకుని రాజధాని రైతుల వద్జకు వచ్చామని…మరోసారి వైసీపీ వస్తే రాజధానికి భవిష్యత్ చీకటే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి వేదిక నుంచి తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా…వచ్చే ఏడాది జనసేన – టీడీపీ ప్రభుత్వంలో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకుందామని స్పష్టం చేశారు. ఈ సంక్రాంతి మార్పుతో వచ్చిన విప్లవ కాంతి…క్రాంతితో కూడుకున్న కాంతి రావాలని ఆశిస్తున్నానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news