చంద్రబాబుకు చెప్పుకోవటానికి ఒక పథకం లేదు, ప్రాజెక్టు లేదు – పెద్దిరెడ్డి

-

చంద్రబాబుకు చెప్పుకోవటానికి ఒక పథకం లేదు, ప్రాజెక్టు లేదంటూ చురకలు అంటించారు మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇసుకాసురుడు అంటు చంద్రబాబు జగన్ పై ఆరోపణలు చేశారని… ఇసుక విధానం పై 19 సార్లు చంద్రబాబు జీవోలు తెచ్చారని మండిపడ్డారు.

ఇసుకను దోచిన వారే ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని.. శాఖను సక్రమంగా నిర్వహించటం వల్లనే ఆదాయాలు పెంచగలిగామని వెల్లడించారు మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఉచితం అని చెప్పి ప్రజలకు సున్నం పెట్టింది ఎవరు?? అని నిలదీశారు. ఎమ్మార్వో వనజాక్షి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుంటే చంద్రబాబు ఏం చేశాడన్నారు. అప్పట్లో లోకేష్ కు ప్రతి నెల 500 కోట్లు ముట్టేవని ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్జీటీనే 100 కోట్ల జరిమానా విధించిందని.. కరకట్ట ఇసుక తవ్వకాల పై పెనాల్టీ వేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version