మనసు చంపుకుని బుచ్చయ్య చౌదరి రాజకీయం చేస్తున్నారు – పేర్ని నాని

-

మనసు చంపుకుని బుచ్చయ్య చౌదరి రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని. అసెంబ్లీ లాబీల్లోని టీడీఎల్పీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, సత్యనారాయణ రాజు-పేర్ని నాని మధ్య చర్చ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం హింసను కోరుకుంటోందన్న పేర్ని…సభలో జరిగిన పరిణామాలను లాబీల్లో వివరించారు.

perni Nani comments on Buchaiah Chaudhary
perni Nani comments on Buchaiah Chaudhary

బుచ్చయ్య మనస్సు చంపుకుని రాజకీయం కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు పేర్ని నాని. తాను రాజకీయం కోసం కాదు.. రాజ్యాంగం కోసం పని చేస్తున్నానని బదులు ఇచ్చారు బుచ్చయ్య చౌదరి. కాగా, ఏపీ అసెంబ్లీ ఇవాళ మీసాలు తిప్పడం, తొడగొట్టడానికి వేదికైంది. సమావేశాలు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసన చేపట్టగా… అంబటి వారిని వారించారు. దీంతో ఆయనను చూస్తూ టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారు. అది చూసి అంబటితో పాటు ఇతర వైసిపి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టి బాలకృష్ణకు సవాల్ విసిరారు. ‘రా బయటకు చూసుకుందాం’ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news