శ్రీశైల సన్నిధిలో అపచారం…మద్యం సేవించి సిబ్బంది !

-

శ్రీశైల సన్నిధిలో అపచారం చోటు చేసుకుంది. మద్యం సేవించి విధుల్లోకి వచ్చింది సిబ్బంది. ఇక ఆగ్రహంతో విధుల్లో ఉన్న సిబ్బందిని చితక బాదారు భక్తులు. సిబ్బంది ప్రయివేటు సంస్థ నుండి ఉద్యోగంలో చేరినట్లు చెబుతున్నారు స్థానిక అధికారులు. భక్తులకు కనీసం కంపార్ట్ మెంట్ లో మంచినీటి వసతి కూడా లేదని మండిపడుతున్నారు భక్తులు. అంతేకాదు… ఆలయం ముందు ధర్నా చేపట్టారు భక్తులు. మద్యం సేవించి ఉన్న వారిని పోలీసులకు అప్పగించారు భక్తులు.

Srisailam Temple

ఇంత జరుగుతున్నా పట్టించుకోని ఆలయ ఈఓ..ఒక్క మాట మాట్లడలేదు. చివరకు ఓ అధికారి వచ్చి మద్యం సేవించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పి భక్తులను బుజ్జగించారు. మరో వైపు ధర్నా చేస్తుంటే పోలీసులు మమ్మల్నే తోచేసారు అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను కాపడలంటూ భక్తులు డిమాండ్ చేశారు. ఆలయ పవిత్రతను కాపాడలేని EO ను తొలగించాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news