తిరుమల శ్రీవారి ఆలయం సన్నిధిలో కలకలం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది. ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై నుండి విమానం వెళ్ళింది. దింతో టిటిడి అధికులు అలెర్ట్ అయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడంపై ఆరా తీస్తున్నారు.

అటు తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. వేసవికాలం సెలవులు ముగియనుండడంతో విపరీతంగా భక్తులు తిరుమల శ్రీవారి వద్దకు చేరుకుంటున్నారు. దాదాపు దర్శనానికి 20 గంటలకు పైనే సమయం పడుతుంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఒకరోజు సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 95, 080 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు వచ్చింది.
తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు
ఉదయం 9 గంటల సమయంలో ఆలయంపై నుండి వెళ్లిన విమానం#TTD #Tirumala pic.twitter.com/sE6cgD7MMb
— Rahul (@2024YCP) June 1, 2025