యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు

-

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు విపరీతంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి పోటెత్తారు. స్వామి వారి ఉచిత దర్శనానికి మూడు గంటలకు పైనుంచి సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతుంది. క్యూలైన్ అని ఉందా భక్తులు నిండిపోయారు.

భక్తులు పోటెత్తడంతో బస్టాండ్ సత్యనారాయణ స్వామి వ్రత మండపం పార్కింగ్ ప్రదేశాలు తదితర ప్రాంతాలలో విపరీతంగా సందడి వాతావరణం నెలకొంది. ఆలయ పరిసరాల్లో అందుతున్న సౌకర్యాల పైన భక్తులను ఈవో వెంకట్రావు ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కరెక్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు తిరుమలలో కూడా విపరీతంగా భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news