ఇండియాలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే మూడు వేలకు పైగా కరోనా కేసులు ఇండియా వ్యాప్తంగా నమోదు అయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల రిపోర్టును కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటన చేసింది. గడిచిన 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా 362 కరోనా కొత్త కేసులు నమోదు అయినట్లు.. అధికారులు వెల్లడించారు. అయితే అదే సమయంలో 1818 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కూడా అయినట్లు వెల్లడించారు.

కొత్తగా రెండు మరణాలు సంభవించినట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 28 మంది కరోనా కారణంగా మరణించారని హెల్త్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇక తాజా కేసులతో ఇండియావ్యాప్తంగా యాక్టివ్గా కేసుల సంఖ్య 3758 గా ఉన్నట్లు వెల్లడించింది. అత్యధికంగా కేరళలో 1400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 కేసులు ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కరోనా కేసుల నమోదు కంటే రికవరీ సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో జనాలు కాస్త ఊరటగా ఉన్నారు.