ప్రధాని మోదీ ఏపీ పర్యటన తేదీల్లో మార్పు.. ఎప్పుడొస్తున్నారంటే?

-

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఓవైపు ఉత్తర భారతంలో ఎన్నికల ప్రచారం చేస్తూనే.. ఇప్పుడు దక్షిణ భారతంలో పర్యటనకు ప్రణాళికలు వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మోదీ విస్తృతంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మే నెలలో మోదీ ఏపీకి రానున్న విషం తెలిసిందే. అయితే ప్రధాని పర్యటన తేదీలో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని మోదీ మే 3, 4 తేదీల్లో వస్తారని ముందుగా అనుకున్నారు. అయితే ఈ తేదీలు మారాయి. మే 7, 8వ తేదీల్లో మోదీ వచ్చి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. తేదీలు మారడానికి కారణం మూడో దశ ఎన్నికలు అని సమాచారం. ప్రస్తుతం మోదీ.. మూడో దశ ప్రచారంలో జోరుగా ఉన్నారు. మే 7న మూడో దశ పోలింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోజున ఏపీ వచ్చి.. రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడ, పీలేజు వంటి ప్రాంతాల్లో జరిగే ప్రచార సభల్లో మోదీ పాల్గొంటారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news