వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి : ఎంపీ పుట్టా మహేష్

-

పోలవరం ప్రాజెక్ట్ప ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో లెటర్ ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. వందేభారత్ ట్రైన్, చింతలపూడిలో రైల్వే లైన్ నిర్మాణంపై లెటర్ ఇస్తామని తెలిపారు.

ఏలూరు పార్లమెంట్ పరిధిలోని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లు పక్కా ప్లాన్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన పార్లెమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఏలూరు లోక్ సభ స్థానం నుండి బరిలోకి దిగిన పుట్టా మహేష్.. సమీప వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version