విశాఖ నగరంలో విసృత తనిఖీలు..!

-

విశాఖ నగరంలో విసృత తనిఖీలు చేపట్టారు అధికారులు.ఈరోజు తెల్లవారుజామున నుండి లాడ్జి లపై తనిఖీలు చేపట్టారు పోలీసులు. సీపీ బాగ్చీ ఆదేశాలతో 100 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. నగరంలో ఉన్న ఏ ఒక్క లాడ్జిని కూడా వదలకుండా రైడ్ చేస్తున్నారు.

అయితే ఈ లాడ్జిల విషయంలో పక్కాసమాచారం తో పోలీసు దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ తనిఖీలలో భారీగా గంజాయితో పాటుగా కొంతమంది అనుమానితలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే విశాఖకు ఇతర రాష్ట్రాల నుండి కొందరు గంజాయి స్మగ్లర్లు వచ్చినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉండటంతో ఈ తనిఖీలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే లాడ్జిల యొక్క రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు పోలీసులు. ఎవరి పై అనుమానం వచ్చినా.. రికార్డుల విషయంలో అవకతవకలు ఉన్నా కూడా వారిని అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news