రూ.15 కోట్లు ఇచ్చి పవన్‌ను టీడీపీనే ఓడించింది – పోసాని సంచలనం

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై ఏపీ ఎఫ్డిసి చైర్మన్ పోసాని కృష్ణ మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమవరంలో ఎందుకు ఓడిపోయావో తెలుసా పవన్ కళ్యాణ్?.. రూ. 15 కోట్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయొద్దని టీడీపీ వాళ్ళు భీమవరం ఓటర్లకు చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు.

చంద్రబాబు, ఆయన కొడుకు పుణ్యమా అని డేటా చోరీ జరిగిందని.. హైదరాబాద్ ఉన్నప్పుడు చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రజల డేటా తీసుకున్నారని ఆగ్రహించారు. పవన్ కళ్యాణ్ తెలిసి తెలియక తప్పులు చేశాడు అని చిరంజీవి క్షమాపణలు చెప్పారని ఫైర్‌ అయ్యారు.చంద్రబాబు దృష్టిలో పవన్ ఓ వాన పాము.. మా దృష్టిలో మంచివాడన్నారు. పవన్ కళ్యాణ్ రియలైజ్ కాడు. ఎందుకంటే ఆయన మాటలు కాదు. చంద్రబాబు, ఇతరుల మాటలు అని ఆగ్రహించారు. వాళ్ళ ట్రాప్ లో పడి అందరికి దూరం అయ్యావు పవన్ కళ్యాణ్ అంటూ విరుచుకు పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version