బీజేపీ నేతలకే టీటీడీ ఛైర్మన్‌ పదవి.. పురందేశ్వరి కీలక ప్రకటన !

-

ప్రపంచంలోనే బీజేపీ బలమైన రాజకీయ పార్టీ..ఎవరూ టచ్ చేయలేరన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. పొల్లం గంగిరెడ్డి ,బీజేపీ లో చేరుతున్నారు అన్నది, ప్రచారం మాత్రమేనని తెలిపారు. ఆ జిల్లా కార్యవర్గంతో మాట్లాడి ,జిల్లా నాయకత్వం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటాం… ఆ జిల్లా నాయకత్వం చర్చలు జరుపుతుందేమో చూడాలని పేర్కొన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి..

వైసిపి నుంచి కొద్దిమంది బిజెపిలోకి వస్తున్నారనేది ప్రచారం మాత్రమే…. చర్చల దశలోనే ఆ వ్యవహారాలు ఉన్నాయని చెప్పారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ,ఎవరైనా బిజెపిలోకి వస్తానంటే ఆలోచిస్తాం… వచ్చినవారు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని కోరారు. ఎవరు పార్టీలో చేరినా, ముందు జిల్లా కార్యవర్గంతో చర్చించాలి ,జిల్లా కార్యవర్గం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటామన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. మా కార్యకర్తలు ,నాయకులు ,నామినేటెడ్ పదవులు ఆశించడంలో తప్పులేదు… నామినేటెడ్ పదవుల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. టీటీడీ చైర్మన్ పదవిని బిజెపి ఆశిస్తుందనేది ,బయట జరుగుతున్న ప్రచారమే, అందులో వాస్తవాలు లేవు..చర్చలు పూర్తవగానే మీడియాకు చెబుతామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news