జగన్ మెహన్ రెడ్డి ఓ రాక్షసుడు – రఘురామ

-

ఎందరో రాక్షసులను చూశామని, రాక్షసులే తల దించుకునేలా జగన్ మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఉన్నదని, ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారి రాక్షసుడని అంటున్నారని, జగన్ మోహన్ రెడ్డి కంటే మనం చాలా మంచోళ్లం కదా… అతనితో మనల్ని ఎందుకు కలుపు తున్నారని రాక్షసులే విస్తుపోయేలా జగన్ మోహన్ రెడ్డి గారి చేష్టలున్నాయని రఘురామకృష్ణ రాజు గారు ధ్వజమెత్తారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా అమలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కీంకు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కీంకు ఎటువంటి తేడా లేదని, గుజరాత్ వెళ్లి మరి సీఐడీ పోలీసులు అన్ని తనిఖీ చేశారని, అయినా 370 కోట్ల రూపాయలకు ఇంత బెనిఫిట్ లభిస్తే, ఈ స్కీమును అమలు చేసిన వ్యక్తిని ఇంతగా వేధిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారిని క్షమించి వదిలేయాలా? అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు వారినే ఇంతగా వేధిస్తే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి అంటూ నిలదీశారు. రాముడికే 14 ఏళ్ల పాటు అరణ్యవాసం తప్పలేదని, చంద్రబాబు నాయుడు గారు కూడా 14 రోజుల జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొనవచ్చునని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన సమాధికి తానే గొయ్యి తవ్వుకుంటున్నారని, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు రేపు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక, మద్యం కుంభకోణాలలో అక్రమాలను వెలికి తీసి వెధవ పనులు చేసిన గ్యాంగ్ ను జైల్లో పెట్టడం ఖాయమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news