అవినాష్ తల్లికి గుండెపోటు వస్తే..జగన్ నవ్వుతున్నాడు – RRR

-

అవినాష్ తల్లికి గుండెపోటు వస్తే..జగన్ నవ్వుతున్నాడని రఘురామ కృష్ణరాజు చురకలు అంటించారు. అవినాష్ రెడ్డి గారి తల్లి గుండెపోటుతో పుట్టింటి ఆసుపత్రిలో చేరితే, తమ్ముడు అంటే ప్రాణం ఇచ్చే జగన్ మోహన్ రెడ్డి గారు చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ వాలంటీర్లతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం విడ్డూరంగా ఉందని అన్నారు.

కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి గారి తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఆయన విచారణకు హాజరు కావడానికి మరొక తేదీని కేటాయించాలని అవినాష్ రెడ్డి గారి తరపు న్యాయవాదులు సీబీఐ అధికారులను కోరారని, అయితే సీబీఐ హెడ్ క్వార్టర్స్ మాత్రం అవినాష్ రెడ్డి గారి అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసిందని అన్నారు.

శుక్రవారం సీబీఐ విచారణకు హాజరు కావలసిన అవినాష్ రెడ్డి గారు సీబీఐ కార్యాలయానికి బయలుదేరిన తరువాత తన తల్లికి గుండెపోటు వచ్చిందని తెలియడంతో ఆందోళనగా పులివెందులకు బయలుదేరారని నీలి చానల్స్ స్క్రోలింగ్ వేస్తున్నాయని, తాను ఆందోళనతో ఉన్నానని అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేసి ఆ చానల్స్ కు చెప్పారా?, లేకపోతే ఆయన ముఖాన్ని పరిశీలించి ఆందోళనతో ఉన్నారని ఆ నీలి చానల్స్ నిర్ధారించుకున్నాయా? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news