టీడీపీ కంటే జగన్‌ సభకు తక్కువ జనాలు వచ్చారు – రఘురామ

-

పీలేరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రా కదలిరా సభకు హాజరైన జన సందోహంతో పోల్చితే సగం మందైనా విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం సంగి వలసలో జగన్ మోహన్ రెడ్డి గారు నిర్వహించనున్న సిద్ధం సభకు హాజరవుతారా? అన్నది సందేహమేనని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథులుగా హాజరైతే సుమారు 4 లక్షల మంది జనం పాల్గొన్నారని, ఎలాగైనా ఆ సభకు వచ్చిన దాని కంటే ఎక్కువ మందిని సిద్ధం సభకు తరలించాలని వైకాపా నాయకులు భావిస్తున్నారని తెలిపారు.

ఇప్పటికే వెయ్యి ఆర్టీసీ బస్సులను ఈ సభ కోసం బుక్ చేశారని, శనివారం కొన్ని స్కూళ్లకు సెలవు ఇచ్చారని, రెగ్యులర్ గా నడిచే స్కూళ్లను కూడా మూసివేసి స్కూలు బస్సులలో సభకు ప్రజల్ని తరలించాలని భావిస్తున్నారని తెలిపారు. సిద్ధం సభ కోసం సభా వేదికను ర్యాంపు వాక్ వేదికలా తీర్చిదిద్దారని, ఇక సభికులు కూర్చునే ప్రాంగణాన్ని ఎక్కడికక్కడ కానాల మాదిరిగా విభజించారని, జగన్ మోహన్ రెడ్డి గారి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ర్యాంప్ వాక్ చేస్తూ రాగానే ఆయన్ని కొంత మంది పెయిడ్ ఆర్టిస్టులు ప్లకార్డులు పట్టుకుని చేతులను తాకుతారట అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version