వైసీపీకి 25 సీట్లే వస్తాయి – రఘురామ సంచలనం

-

వైసీపీకి 25 సీట్లే వస్తాయని..నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యాఖ్యానించారు. వ్యూహం సినిమా కలెక్షన్లు దారుణం అయితే అంతకంటే ఘోరమైన పరాభవాన్ని వైకాపా చవిచూడనుందన్నారు. రాయలసీమ ప్రాంతంలో వైకాపాకు 20 నుంచి 25 స్థానాలు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో 15 స్థానాలను కలుపుకొని మొత్తంగా 40 స్థానాలు వస్తాయని ఇన్నాళ్లు భావించామని, కానీ ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే సింగల్ డిజిట్ కు పరిమితమైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నారు.

Ysrcp rebel mp raghurama raju 

వ్యూహం సినిమా ద్వారా ప్రజలు వైకాపాకు ఒక టీజర్ లాంటి షాక్ ఇచ్చారని, వైకాపా శ్రేణులు ఓటమిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఓడిపోయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టనున్న ఓదార్పు యాత్రకు, ఇంకా పార్టీలో పనికిమాలిన వారు ఎవరైనా మిగిలి ఉంటే వారు సిద్ధంగా ఉండాలన్నారు. అంతలోనే రఘురామకృష్ణ రాజు గారి గోశాలలోని గోమాత గజ్జల చప్పుడు చేయడంతో ఇది నిజమని, గోమాత కూడా నిజమనే చెబుతోందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news